టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే సందీప్, ఇప్పుడు తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్తో మన ముందుకు వస్తున్నారు. అదే 'పవర్ పేట'. చాలా కాలంగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రంపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. సందీప్ కిషన్ నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి విజయవంతంగా 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన సినిమా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, సినిమా కథలోని తీవ్రతను కూడా సూచిస్తోంది. విడుదలైన పోస్టర్లో చెస్ బోర్డుపై రక్తపు మరకలు, పక్కనే ఒక ఎర్ర గులాబీ డిజైన్ చేసి ఉంది. ఇది చూస్తుంటే సినిమా చాలా ఇంటెన్స్గా ఉండబోతుందని అర్థమవుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, మైండ్ గేమ్స్ కూడా సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయని ఈ చెస్ బోర్డ్ హింట్ ఇస్తోంది.
పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగే పవర్ఫుల్ స్టోరీగా 'పవర్ పేట' ఉండబోతోందని తెలుస్తోంది. 'రౌడీ ఫెలో', 'చల్ మోహన్ రంగ', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన సంగీతం ఈ పొలిటికల్ డ్రామాకు మరో పెద్ద అసెట్ కానుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 'పవర్ పేట' చివరకు పట్టాలెక్కుతుండటంతో సందీప్ కిషన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. హీరోయిన్ ఎవరనేది, అలాగే ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్ల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. సందీప్ కిషన్ కెరీర్లో ఈ సినిమా ఒక ల్యాండ్మార్క్ హిట్గా నిలుస్తుందో లేదో చూడాలి.