Italy Earthquake : ఇటలీలో మరో సారి భారీ భూకంపం.. 5.0 తీవ్రతగా నమోదు..

ఇటలీ (Italy) లో భూకంపం సంభవించింది. ఇటలీలో మరోసారి భూకంపం వచ్చింది. ఇటలీలోని కాలాబ్రియా (Calabria) ప్రాంతంలో భూమి కంపించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 August 2024, 1:17 PM IST

 

 

ఇటలీ (Italy) లో భూకంపం సంభవించింది. ఇటలీలో మరోసారి భూకంపం వచ్చింది. ఇటలీలోని కాలాబ్రియా (Calabria) ప్రాంతంలో భూమి కంపించింది. ఆగస్టు 1, 2024న, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:43 గంటలకు, ఇటలీలోని కాలాబ్రియా లోని రోసానో స్టాజియోన్ నుండి 18.2 కిలోమీటర్ల దూరంలో 21 కిలోమీటర్ల లోతులో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం 5.1 నుండి 5.3 వరకు ప్రారంభ తీవ్రతతో టొరంటో, బారి కాటాన్జారో తో సహా ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రతను యూరోపియన్-మెడిటరేనియన్ (Mediterranean) సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) మొదటిసారిగా 5.1గా నమోదు చేసింది. అయితే, జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం, తరువాతి డేటా 5.3 తీవ్రతను సూచించింది. మరో వైపు ఈ భూకంప కేంద్రం నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోసెంజా నగరం కూడా భూమి కంపించినట్లు అధికారులు గుర్తించారు.

ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. భయాందోళనలతో... భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదని చెబుతున్నారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లను వదిలి బయటే గడుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Suresh SSM

Published : 
  • 2 August 2024, 1:17 PM IST