తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాల్లో ఇప్పటి వరకూ 13 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. ఇంకా 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో వరంగల్ సీటు కడియం కావ్యకు ఇచ్చే అవకాశముంది. బీఆర్ఎస్ టిక్కెట్ను త్యాగం చేసి వచ్చిన కావ్యకు కాంగ్రెస్లో కన్ఫమ్ అయినట్టే అని చెబుతున్నారు.
