ఢిల్లీ ఎక్సైజ్ పాలనీని రూపొందించడం, అమలు చేయడంలో కవితతో పాటు ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలసి కుట్ర పన్నినట్టు తమ దర్యాప్తులో తేలినట్టు ఈడీ తెలిపింది. ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలను లంచాలంగా అందించింది కూడా కవితేనని ఈడీ అధికారులు తేల్చి చెప్పారు.
