ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2019లో వైయస్సార్సీపీకి పనిచేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్.. ఇకపై టీడీపీకి తన వ్యూహాలను అందించబోతున్నారు. ఎలక్షన్ మేనేజర్ గా, రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే అత్యంత ప్రముఖుడైన పీకే 2019 ఎన్నికల కోసం వైఎస్ఆర్సిపికి పని చేశారు. జగన్ పార్టీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా ఉందనేది కొందరి అభిప్రాయం. ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ జగన్ సర్కార్ కి పనిచేస్తోంది.

Prashant Kishore, who has changed party, will serve TDP from now on