గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం ముగ్గురు నుంచి నలుగురు పోటీపడుతున్నారు. అందుకే తుది జట్టు ఎంపిక క్లిష్టంగా మారుతోంది. పిచ్ పరిస్థితి , ప్రత్యర్థిని అంచనా వేసుకుని ఫైనల్ ఎలెవన్ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆసీస్ టూర్ లో రెండో టెస్టుకు భారత తుది జట్టు ఎంపిక ఛాలెంజ్ గా మారింది.
