తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటం చాలా సంతోషించదగ్గ విషయమని ఏపీ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు నని చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ మిత్ర పక్షాలేనని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం పంపకాల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇప్పుడు ఓ అవకాశం వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అయితేనే బాగుంటుందని.. రేవంత్ సీఎంగా ఉంటే.. విభజన పంపకాలు సూలువుగా జరుగుతాయి అని అన్నారు.

Revanth Reddy is a disciple of Chandrababu.. Telangana needs Revanth Reddy as CM..