న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ను 0-3 తో ఓడిపోవడాన్ని భారత్ ఫాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. అటు మాజీ ఆటగాళ్ళు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయని భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను సైతం ఈ ఓటమి తీవ్రంగానే బాధించింది.
