ఇన్నాళ్లూ తమలో ఐక్యత లేకపోవడం వల్లే బీజేపీ గెలుస్తూ వచ్చిందని పార్టీలు గ్రహించాయి. ఇది ఇలాగే కొనసాగితే తమకు రాబోయే ఎన్నికల్లో కూడా విజయం దక్కడం కష్టమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అందుకే ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.
