కాపులకు రిజర్వేషన్లు కావాలంటూ.. టీడీపీ హయాంలో ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఉద్యమం ఊసే లేదు. 2009 ఎన్నికల్లో ఓడిపోయాక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన ముద్రగడ.. ప్రస్తుతం పొలిటికల్ ఉక్కపోత భరించలేక ఫ్యాన్ కిందికి రావాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే.. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపినా.. పార్టీ పెద్దలు మాత్రం ఆయనను వేరే విధంగా కన్విన్స్ చేస్తున్నట్టు తెలిసింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుని పక్కన పెట్టేసింది అధికార పార్టీ. ఎంపీ వంగా గీతను పిఠాపురం బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Soon Mudragada will join YCP.. Will he stand on Pawan?