New rules on the use of SIM cards from today. Violation Rs. 10 lakh fine.. Tasmat Jagrata..
నేటి నుంచి దేశవ్యాప్తంగా సిమ్ కార్డుల విక్రయానికి సంబంధించిన కొత్త రూల్స్ ఆగస్టు నేలలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. నేటి నుంచి ఆ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి..
దేశవ్యాప్తంగాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధల ప్రకారం.. పీఓఎస్ ఏజెంట్లు చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండటానికి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా లైసెన్స్ దారు ఒప్పందం పై సంతకం చేయాలి. ఈ నియమాలను అతిక్రమించిన ఏజెంట్లకు రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాకుండా వారి లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం లేకపోలేదు.
ఓ వ్యక్తి కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే సిమ్ వినియోగదారుడు తప్పనిసరిగా తన వ్యక్తి గత వివరాలను అందించాలి. సిమ్ కార్డు అందించే ఏజెంట్ కొనుగోలు చేసే వ్యక్తి ఆధార్ కార్డు క్యూఆర్ స్కాన్ చేసి వివరాలు సేకరిస్తాడు. ఇక్క చేయాల్సిన మరో క పని.. ఒక సిమ్ డిస్ కనెక్ట్ అయిన 3 నెలల తర్వాత కొత్త కస్టమర్ కు ఇవ్వాలి. అదే విధంగా మరో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఒక వ్యక్తి ఒక ఐడీ మీద గరిష్టంగా 9 సిమ్ కార్డుల కంటే ఎక్కువ కొనుగోలు చేయకూడదు.. అయితే కమర్షియల్, బిజినెస్, కార్పొరేట్ ఖాతాలకు ఈ నియమం వర్తించదు.