కోచ్ గా బాధ్యతలు చేపట్టకముందే బీసీసీఐకి కొన్ని కండీషన్లు పెట్టిన గౌతమ్ గంభీర్ వాటిని అమలు చేయడంలోనూ స్ట్రిక్ట్ గానే ఉన్నాడు. ముఖ్యంగా జట్టు ఎంపికలో రాజీ పడేది లేదని ముందే తేల్చేశాడు. ఏ ఆటగాడైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఆ ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశాడు.
