15 నగరాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్స్… తెలుగు రాష్ట్రంలో ఎక్కడో తెలుసా…?

ఐపీఎల్ ప్రారంభం అవుతుందంటే మన దేశంలో క్రికెట్ ఫ్యాన్స్ కు రెండు నెలల పాటు పండుగే. తమ తమ అభిమాన క్రికెటర్ల కోసం స్టేడియాల్లో ప్రేక్షకులు పోటెత్తుతారు. ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ, చెన్నై, ముంబై లాంటి జట్లు మ్యాచ్ ఆడుతున్నాయంటే ఆ రోజు టికెట్లు దొరకడం

Post Published By: dialnews
Updated : 24 March 2026, 11:15 AM IST

ఐపీఎల్ ప్రారంభం అవుతుందంటే మన దేశంలో క్రికెట్ ఫ్యాన్స్ కు రెండు నెలల పాటు పండుగే. తమ తమ అభిమాన క్రికెటర్ల కోసం స్టేడియాల్లో ప్రేక్షకులు పోటెత్తుతారు. ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ, చెన్నై, ముంబై లాంటి జట్లు మ్యాచ్ ఆడుతున్నాయంటే ఆ రోజు టికెట్లు దొరకడం కూడా కష్టమే. అందుకే ప్రతి ఏడాది ప్రేక్షకులకు స్టేడియం థ్రిల్ అందించేందుకే బీసీసీఐ ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఈ ఫ్యాన్ పార్క్స్ ఒక్కో వీకెండ్ ఒక్కో చోట నిర్వహిస్తారు.ఈ ఏడాది దేశవ్యాప్తంగా 15 నగరాల్లో ఫ్యాన్స్ పార్క్స్ ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. మార్చి 28 నుంచి మూడు వీకెండ్లలో ఈ ఫ్యాన్స్ పార్క్స్ నిర్వహిస్తారు. లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్‌తో పాటు మ్యూజిక్స్, ఫుడ్ కోర్ట్స్, గేమ్స్, ఫ్యాన్ యాక్టివిటీస్ వంటి ఎన్నో వినోదాలు అందుబాటులో ఉంటాయి.

2015లో ప్రారంభమైన ఈ ఫ్యాన్ పార్క్స్‌కు ఎప్పటికప్పుడు ఆదరణ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న ఫ్యాన్స్ పార్క్స్ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్క నగరానికి అవకాశం దొరికింది. తెలంగాణలోని నిజామాబాద్‌ ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ గ్రౌండ్స్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు.మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 కోసం స్టేడియాలతో పాటు ఫ్యాన్ పార్క్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ ఐపీఎల్ జరిగే మొదటి మూడు వారాలు ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని నలుమూలలు కవర్ అయ్యేలా నగరాల జాబితాను బీసీసీఐ సిద్ధం చేసింది.

ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో ఓ క్రమ పద్ధతిలో ఈ ఫ్యాన్ పార్క్స్ ఏర్పాటు చేస్తారు.తొలి వీకెండ్‌లో అంటే మార్చి 28, 29 తేదీల్లో.. రోహ్తక్, భోపాల్, నాగ్‌పూర్, తుమకూరు, కృష్ణనగర్ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. రెండో వీకెండ్‌ ఏప్రిల్ 4, 5 తేదీల్లో మథుర, జోధ్‌పూర్, నిజామాబాద్, మైసూర్, భువనేశ్వర్ నగరాల్లో కొనసాగుతాయి. ఇక చివరి వీకెండ్ ఏప్రిల్ 11, 12 తేదీల్లో మీరట్, నడియాద్, రత్నగిరి, కోయంబత్తూరు, రౌర్కెలా నగరాల్లో ఈ ఫ్యాన్ పార్క్స్ ఏర్పాటు చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.దేశంలో రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్ మాత్రమే విడుదల చేసింది. దాంతో తొలి మూడు వారాల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించే ఫ్యాన్ పార్క్స్‌ను ఏర్పాటు చేశారు. తుది దశ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత మిగతా ఫ్యాన్ పార్క్స్ వివరాలను బీసీసీఐ వెల్లడించనుంది.

Published : 
  • 24 March 2026, 11:15 AM IST