Hyderabad Formula Race Scam: కేటీఆర్ చెబితే రూ.54 కోట్లు ఇచ్చా.. అర్వింద్ పై వేటు తప్పదా ?
తెలంగాణలో ఫార్ములా ఈ-రేస్ కోసం 54 కోట్ల రూపాయల జనం సొమ్మును ధారాదత్తం చేశారు. అప్పటి మంత్రి కేటీఆర్ నోటి మాటగా చెప్పగానే….. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా… వెనకా ముందు చూసుకోకుండా రిలీజ్ చేశారు సీనియర్ IAS అధికారి అర్వింద్ కుమార్. మళ్ళీ BRS ప్రభుత్వమే వస్తుందన్న ధీమానో… మనల్ని అడిగేదెవడు అనే ధైర్యంతోనే అప్పనంగా కోట్ల రూపాయలు ఇచ్చేశారు.