Parliament Elections : ఆ రెండు ఎంపీ సీట్లకు తీవ్ర పోటీ..!
తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత తర్వాత ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. రాష్ట్రంలో ఈసారి మల్కాజ్ గిరి, చేవెళ్ళ ఎంపీ స్థానాలు హాట్ సీట్లుగా మారబోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి మహా మహులు ఈ సీట్లను దక్కించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఈ రెండు స్థానాల్లో గెలుపు లక్ష్యంగా భావిస్తున్నాయి. దాంతో త్రిముఖ పోరు తప్పేలా లేదు.