Schedule of CM Revanth's visit today
నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections), ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇవాళ చేవెళ్ల లోక్ సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో బీజేపీ (BJP) పై ఛార్జ్ షీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు చేవెళ్ల నియోజకవర్గంలోని రాజేంద్రనగర్లో రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 7.30 గంటలకు కంటోన్మెంట్లో రోడ్ షోలో సీఎం పాల్గొంటారు. చేవెళ్ల (Chevella) అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి (Gaddam Ranjith Reddy) కి మద్దతుగా ర్యాలీతో పాటు సభలోనూ సీఎం ప్రసంగించనున్నారు.