Rajasthan Congress: కర్నాటక ఉత్సాహం… రాజస్థాన్లో ఆవిరి..! పాపం కాంగ్రెస్..!!
సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో వీళ్లద్దరి మధ్య సయోధ్య కుదర్చలేక కాంగ్రెస్ అధిష్టానం చేతులెత్తేస్తోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్లో నెలకొన్న ఈ సంక్షోభం ఎలాంటి మలుపులు తీసుకుంటుందోననే భయం పార్టీలో కనిపిస్తోంది.