Jayalalitha: ఆరు ట్రంకు పెట్టెల్లో జయలలిత నగలు.. ఎవరికో తేల్చేసిన కర్ణాటక కోర్టు..
అక్రమాస్తుల కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి బంగారు, వజ్రాభరణాలు, చీరలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. వాటిలో మొత్తం 27 కేజీల బంగారు, వజ్రాభరణాలతో పాటు, 700 కేజీలకుపైనే వెండి ఉంది.