Etela Rajender: బీజేపీకి గుడ్బై చెప్పనున్న ఈటల, వివేకా..? మరికొందరు నేతలు కూడా లైన్లోనే.. కమలానికి షాక్ తప్పదా?
కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన నేతలు ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయినట్లు తాజా కబురు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డితోపాటు.. మాజీ ఎంపీ వివేక్ కూడా తిరిగి కాంగ్రెస్లో చేరబోతున్నట్లు సమాచారం.