Former Telangana Governor Tamilisai's visit today...
తెలంగాణ మాజీ గవర్నర్ (Former Governor) తమిళిసై (Tamilisai) నేడు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పర్యటించనున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్, మెదక్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు తమిళి సై సౌందర్ రాజన్ సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బీజేపీ (BJP) అభ్యర్థి అయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy), మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandar Rao), ను గెలిపించాలని ప్రజలను కోరనున్నారు. తమిళి సై సౌందర్ రాజన్ జహీరాబాద్ అభ్యర్థులకు కూడా మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆమె తమిళనాడు నుంచి ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. కాగా మొన్నటి వరకు రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న తమిళిసై ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.
SSM