AP CM YS Jaganmohan Reddy : పోతే పోండి..! నష్టం లేదు..!! అసంతృప్తులపై వైసీపీ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడే కొద్దీ.. వైసీపీలో నేతల అసంతృప్తి రకరకాలుగా బయటపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగాలు ఎమ్మెల్యేలకు అంతుచిక్కడం లేదు. సర్వేల పేరుతో ఇప్పటికే 60 మంది దాకా ఎమ్మెల్యేల మార్పు తప్పదని జగన్ స్పష్టంగా చెప్పేశారు. వాళ్ళల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై గందరగోళం నడుస్తోంది. ఈలోపు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందు జాగ్రత్తగా సర్దుకునే ప్రయత్నంలో ఉన్నారు.