Utter Pradesh: యూపీలో గెలిస్తే దేశాన్ని గెలిచినట్టేనా..2024 పార్లమెంట్ఎన్నికలకు బీజేపీ వ్యూహం ఇదేనా ?
లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరో ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. 2014, 2019 విజయభేరిని కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయంపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. మరోసారి విజయంతో మూడోసారి దేశ ప్రధానిగా కొనసాగాలని మోదీ భావిస్తున్నారు. ఆయనకున్న వ్యక్తి గత చరిష్మా, బీజేపీ అమలు చేసే పోల్ స్ట్రాటజీతో విజయం తమ పార్టీనే వరిస్తుందని కమలనాథులు గంపెడు ఆశలతో ఉన్నారు.