Cricket World Cup: పగ తీర్చుకుంటాం: పాకిస్థాన్.. పీకేదెం లేదు: బీసిసిఐ
భారత క్రికెట్ అభిమానులు ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో అయినా టీమిండియా సత్తా చాటుతుందని, కప్పు కొట్టి ఐసీసీ ట్రోఫీ గెలవని కరువు తీరుస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ టోర్నీ షెడ్యూల్ ప్రకటించడంలో మాత్రం ఐసీసీ ఆలస్యం చేస్తోంది.