Pilli Subhash Chandra Bose: బోసు తగ్గారా.. నెగ్గారా..? జగన్ చెప్పిందేంటి..?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎవరూ తగ్గట్లేదు. కొన్ని రోజులుగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న పరిణామాలు తాడేపల్లిని తాకాయి.