ఏపీలో పోలింగ్ తర్వాత.. పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయ్. అల్లర్లు, దాడులతో.. రాష్ట్రం అట్టుడికిపోతోంది. పల్నాడు, తాడిపత్రి రచ్చ కొనసాగుతుండగానే.. దెందులూరులో ఇదే సీన్ ఉంది.
జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లా తాడిపత్రి కింగ్. ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్లో ఉంటూనే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా ఎదిగిన జేసీ దివాకర్ రెడ్డి.. నిత్య వివాదాలకు మారుపేరు.
జేసీ కుటుంబాన్ని జగన్ ఓ రేంజ్ లో తొక్కేస్తున్నారు. ఇప్పటికే జేసీ వ్యాపారాలు కుదేలయ్యాయి. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే జేసీ ఫ్యామిలీకి మరిన్ని ఇబ్బందులు తప్పవు. అందుకే కొత్త డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు. కానీ ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ విషయం జేసీకి కూడా తెలుసు.