BRS, Sabita Indra Reddy : సీఎం వ్యాఖ్యలపై అసెంబ్లీలో గందరగోళం.. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ MLA సబిత ఇంద్రారెడ్డి
వెనకాల కూర్చున్న అక్కల మాటలు వింటే KTR JBSలో కూర్చోవాల్సి వస్తుందని CM రేవంత్ అసెంబ్లీలో అన్నారు. CM వ్యాఖ్యలపై BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఆ పార్టీని తిడుతున్నారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. CM తనను టార్గెట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సబిత డిమాండ్ చేస్తు.. మీడియా పాయింట్ వద్ద భావోద్వేగానికి గురయ్యారు.