telugu people

Manipur: మణిపుర్‌ మండిపోతోంది.. గొడవలకు అసలు కారణం ఇదే..

Manipur: మణిపుర్‌ మండిపోతోంది.. గొడవలకు అసలు కారణం ఇదే..

మణిపుర్‌ స్టేట్‌ మండిపోతోంది. కుకీ, మతీ అనే రెండు తెగల మధ్య రిజర్వేషన్‌ విషయంలో మొదలైన ఇష్యూ.. ఇప్పుడు మణిపూర్‌ను షేక్‌ చేస్తోంది. ఈ గొడవల్లో 54 మంది చనిపోయారు. ఇది కేవలం అఫీషియల్‌గా వచ్చిన రిపోర్ట్‌ మాత్రమే. కానీ మృతుల సంఖ్య దీనికి మూడింతలు ఉందని ఇన్‌సైడ్‌ టాక్‌. స్టేట్‌లో సిచ్యువేషన్‌ను కంట్రోల్‌ చేసేందుకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ మిలిటరీని రంగంలోకి దిపింది. 10 వేల మంది సైనికులు ఇప్పుడు మణిపుర్‌లో పహారా కాస్తున్నారు. ఓ పక్క సైన్యం, ఇంకో పక్క పారామిలిటరీ ట్రూప్స్‌ కలిసి సిచ్యువేషన్‌ను ఇప్పుడిప్పుడే కంట్రోల్‌లోకి తెస్తున్నాయి. హింసాత్మక ప్రాంతాల నుంచి 13 వేల మందిని శిభిరాలకు సేఫ్‌గా తరలించారు.

Summer Pot: ఎండాకాలంలో చలువనిచ్చే కుండలు..!

Summer Pot: ఎండాకాలంలో చలువనిచ్చే కుండలు..!

వేసవి వచ్చిందంటే చాలు ప్రతిఒక్కరూ శీతలపానీయాలు తాగేందుకు ఆసక్తి చూపుతారు. అలాగే నీడచాటుకు పరుగులు తీస్తారు. కొందరైతే ఇంట్లో ఫ్రీజర్లను ఏర్పాటు చేసుకుంటారు. ఇక సామాన్య దిగువతరగతి వాళ్లు మంచి నీటిని తాగేందుకు నేటికీ కుండలనే ఉపయోగిస్తారు. ఆరోగ్యం దృష్ట్యా మట్టి కుండల్లోని నీరు చలువ చేస్తాయని కొందరు విశ్వసిస్తారు. అందుకే నేటికీ ఇందులో నీళ్లను నింపుకొని చల్లగా తాగేందుకు మక్కువ చూపుతున్నారు. ఇది చాలా ఏళ్లుగా వంశపారపర్యంగా వస్తున్న కులవృత్తి. ప్రస్తుతం ఈ మట్టి కళ క్రమక్రమంగా అంతరించి పోతోంది. వాటిని ప్రోత్సహించేందుకు కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నప్పటికీ వీరి జీవనవిధానం అగమ్య గోచరంగా ఉందని చెప్పాలి. నీటి కుండలు తయారు చేసే వారి జీవన విధానాన్ని పరిశీలిద్దాం. దశాబ్దాల కాలం నాటి కుల వృత్తులకు నేటికీ గిరాకీ ఉందా.? అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులేంటో తెలుసుకుందాం.