తెలంగాణలో ఇప్పుడు పండితులకు ఫుల్లు గిరాకీ వచ్చింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు.. ఇండిపెండెంట్ నామినేషన్ వేయడానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు. ఈ నెల 3 నుంచి 10 వరకు నామినేషన్లు వేసుకోవడానికి ఈసీ అనుమతి ఇచ్చింది. దాంతో పార్టీల నుంచి బీఫారాలు అందుకున్న అభ్యర్థులు.. పండితులకు ఫోన్లు చేసి మంచి ముహూర్తం పెట్టాలని కోరుతున్నారు.

When is the best time for nominations in Telangana More nominations on the 9th of this month