ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసలు ఆగడం లేదు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపే ముఖ్య నాయకులను చేర్చుకుంటూ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తోంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పార్టీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆత్మకూరు ఎంపీపీ, జడ్పీటీసీలు, మరికొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ వైపు నడిచారు. ఆ తరువాత గీసుగొండ ఎంపీటీసీలు, పరకాల ఎంపీపీ కూడా BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

Unstoppable migration into Congress... Warangal leaders getting down from the car!