మంగళవారం వేకువఝామున ఉపాసన పాపకు జన్మనిచ్చినట్లు, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి. దీంతో చిరంజీవి కుటుంబంతోపాటు ఉపాసన కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. ఉపాసన డెలివరీ సమయంలో ఆమె తల్లి, కుటుంబ సభ్యులతోపాటు రామ్ చరణ్, చిరంజీవి దంపతులు ఆస్పత్రిలోనే ఉన్నారు.
