AP Leaders : లీడర్లు విదేశాల్లో…. ఓటర్లు పోలీస్ స్టేషన్లో.. !!

ఏపీలో ఒక పల్లెటూరి ఇది. పోలింగ్ అయ్యాక కనిపించిన దృశ్యం ఇది. వందల మంది ఆటవికంగా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ… కర్రలతో కొట్టుకుంటున్నారు. మగాళ్ళకి ఆడాళ్లు కర్రలు , రాళ్లు అందిస్తున్నారు. ఒకరిని మరొకరు చంపాలంటూ అరుస్తున్నారు. ఈ దృశ్యం ఒక్క గ్రామంలోనిదే కాదు…. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిపించింది. ఈ సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గంటకు 14 లక్షలు రూపాయలు ఖర్చుపెట్టి స్పెషల్ ఫ్లైట్లో లండన్ వెళ్లిపోయారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి స్వీడన్ లో సేద తీరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు. షర్మిల కూడా అమెరికా ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళారు. ఎమ్మెల్యేలు, చిన్నా చితకా నేతలు కూడా యూరప్ పర్యటనలో ఉన్నారు. ఇంకొందరు బాలి ద్వీపం వెళ్లి అక్కడ రక రకాలుగా రిలాక్స్ అవుతున్నారు. మరికొందరు స్విట్జర్లాండ్, బ్యాంకాక్ తోపాటు మరికొన్ని విహార ప్రాంతాల్లో సేద తీరుతున్నారు.

Post Published By: dialnews
Updated : 22 May 2024, 12:16 PM IST

Published : 
  • 22 May 2024, 12:16 PM IST

Exit mobile version