జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే రెండు దశల యాత్ర పూర్తి చేసుకుని, విశాఖలో మూడో దశ యాత్ర ప్రారంభించారు. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే, తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన ప్రజల్లోకి వెళ్తుంటే బీజేపీ నుంచి ఎలాంటి మద్దతూ కనిపించడం లేదు.
