ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈసారి కొత్త వాతావరణం కనిపిస్తోంది. ఏదో.. కోటాలో ఇవ్వాలి కాబట్టి పార్టీలు ఇచ్చింది తీసుకోవడం కాకుండా.. ఈసారి మేము సైతం అంటూ.. కొందరు మహిళా నేతలు టిక్కెట్ల కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారట. వైసీపీ, టీడీపీ రెండిట్లో ఈ వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను పరిశీలిస్తే టీడీపీ తరుపున నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, పామర్రు నుంచి ఉప్పులేటి కల్పన పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు.

In Krishna district, whose calculations are theirs..