AP Politics : జగన్‌, బాబు కాదు.. ఆయనే కావాలి.. ఏపీ పాలిటిక్స్‌లో మూడో వ్యక్తి ఎంటర్‌

జగనన్నే మళ్లీ రావాలన్నది వైసీపీ నినాదం. రాష్ట్రం బాగుపడాలంటే బాబు మళ్లీ రావాలన్నది టీడీపీ కేడర్‌ నినాదం. ఏపీ మొత్తం ఇదే సీన్‌ కనిపిస్తోంది. కానీ ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం జగన్‌, బాబు పేరు కాకుండా మూడో పేరు తెరపైకి వచ్చింది. ఆయన వస్తేనే ఆ ప్రాంతం బాగుపడుతుందని ఆ ప్రాంతం యూత్‌ అంతా అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలంటూ ర్యాలీలకు సైతం సిద్ధమవుతున్నారు. ఆయనే మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ మంత్రి రఘువీరారెడ్డి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత రఘువీరా రెడ్డి రాజకీయంగా వీక్‌ అయ్యారు. ఆంధ్రాలో కాంగ్రెస్‌ను బతికించేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ 2019 ఎన్నికల తరువాత సీన్‌ అర్థం చేసకుని సైలెంట్‌ అయ్యారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 December 2023, 1:02 PM IST

Published : 
  • 2 December 2023, 1:02 PM IST

Exit mobile version