ఏ పార్టీయైనా ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరించాలి. అందరి అభిప్రాయాలకు పెద్ద పీట వేయాలి. లేకపోతే పార్టీతో పాటు వ్యక్తులు కూడా నియంతలుగా మారతారు. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే ఆ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. అందరూ హైకమాండ్ జపం చేస్తారు గానీ.. ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తారు. ప్రజాస్వామ్యం ఏస్థాయిలో ఉంటుందంటే నిత్యం గాంధీ కుటుంబం పేరు జపించేవాళ్లు కూడా తమకు అనుకూలంగా పరిణామాలు లేకపోతే తిరుగుబాటు చేసే స్థాయి వరకు వెళ్తారు. దటీజ్ కాంగ్రెస్.

Rajasthan Politcs like karnataka model