Gold prices : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దేశ వ్యాప్తంగా ఏ నగరాల్లో పసిడి ధర ఎంత ఉందో తెలుసా..?
తాజాగా దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 65,100గా ఉండగా, బుధవారం రూ.300 పెరిగి రూ.65,400కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 58,400 రూపాయలకు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.76,786గా ఉండగా, రూ.300 తగ్గి కిలో ధర రూ.76,486గా ఉంది.