Karnataka Power politics : కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ..? కుమారస్వామి విమర్శలతో కొత్త రచ్చ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ప్రచారంలో విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ మధ్య రచ్చకు దారితీస్తోంది. తెలంగాణలో విద్యుత్ సప్లయ్ కి భరోసా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక (Karnataka) లో ఏం వెలగబెడుతుందో గమనించాలని BRS కోరుతోంది. కర్ణాటకలో రైతులకు 5 గంటల పవర్ ఇవ్వడానికి దిక్కులేదని.. తెలంగాణలో ఎలా సాధ్యమవుతుందని BRS చీఫ్ కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అయితే.. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలని కోరుతున్నారు. ఇదే టైమ్ లో కర్ణాటకలో జేడీఎస్ అధినేత కుమార స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ ని ఇరాకటంలోని నెట్టాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 November 2023, 1:21 PM IST

Published : 
  • 12 November 2023, 1:21 PM IST

Exit mobile version