జాతి రత్నం జాతకం ఏంటి…?

'చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే..' అంటూ కుర్రకారు మనసు దోచుకున్న పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమా 'జాతి రత్నాలు'తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ బ్యూటీ

Post Published By: dialnews
Updated : 24 February 2026, 10:20 AM IST

'చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే..' అంటూ కుర్రకారు మనసు దోచుకున్న పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమా 'జాతి రత్నాలు'తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ బ్యూటీ, ఆ తర్వాత ఎందుకో ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయలేకపోయింది. ఒకటా రెండా.. వరుసగా ఫ్లాపులు పలకరించడంతో ఫరియా కెరీర్ డోలాయమానంలో పడింది. రవితేజతో చేసిన 'రావణాసుర', అల్లరి నరేష్‌తో చేసిన 'ఆ ఒక్కటి అడక్కు', మరియు మెర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేశాయి.

ఫరియా హైట్ సుమారు 5'10 వల్ల చాలా మంది హీరోల పక్కన ఆమెకు అవకాశాలు రావడం కష్టమైంది. కేవలం పొడవుగా ఉన్న హీరోలకే ఆమె పరిమితం కావలసి వచ్చింది. మొదటి సినిమా క్లిక్ అవ్వడంతో, కమర్షియల్ సక్సెస్ కంటే కూడా ప్రయోగాత్మక పాత్రల వైపు మొగ్గు చూపడం కూడా ఆమెకు మైనస్ అయింది.అయితే, ఫ్లాపుల్లో ఉన్న ఫరియాకు 'మత్తు వదలరా 2' సినిమా ఊపిరి పోసింది. 2024 సెప్టెంబర్‌లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, ఇందులో ఫరియా చేసిన 'ఇన్‌స్పెక్టర్ నిధి' పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో ఆమె మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చింది.

ఫరియా కేవలం నటి మాత్రమే కాదు, ఆమె మంచి డ్యాన్సర్ మరియు సింగర్ కూడా. 'మత్తు వదలరా 2'లో ఒక సాంగ్ కూడా పాడి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది. తాజాగా హీరో సత్యదేవ్ 15వ సినిమాలో ఫరియా హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూజా కార్యక్రమాలతో మొదలైంది. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన 'వల్లి మయిల్' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నాగార్జున 'బంగర్రాజు', ప్రభాస్ 'కల్కి 2898 AD' వంటి సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి తన పాపులారిటీని కాపాడుకుంటోంది.

Published : 
  • 24 February 2026, 10:20 AM IST