What are the reasons behind the Israeli-Palestinian war
ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ దాదాపు మూడు దశాబ్దాల నుంచే మొదలైంది. ప్రస్తుతం పరిస్థితి చేదాటిపోయి రావణకాష్టంగా మరింది. సాధారణంగా పాలస్తీనా ఆసియాలోని మధ్యధరా సముద్రానికి జోర్థాన్ నదికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ యూదులు, క్రైస్తవులు జీవిస్తూ ఉంటారు. చరిత్రలోకి వెళ్లి చూసినట్లయితే ఈజిప్ట్ రాజులు, పర్షియన్ చక్రవర్తులు, అలెగ్జాండర్, ఆటమన్ దేశాధినేతలు దీనిని పాలించారు. ఈ ప్రాంతమంతా ఒటోమాన్ అనే సామ్రాజ్యంగా ఉన్న తరుణంలో అప్పట్లో ఈ దేశాధిపతి ఓటమి పాలవ్వడంతో బిట్రన్ దీనిని హస్తగతం చేసుకుంది. ఇదంతా 1914 కాలం నాటి మాట. అయితే ఎప్పుడైతే ఒటోమాన్ ఓడిపోయారో యూదులు, క్రైస్తవులు పాలస్తీనాను తమ సొంత ప్రాంతంగా భావించారు. దీనికి అధికసంఖ్యలో ఉన్న అరబులు ససేమీరా అన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య దాడి జరిగింది.
బ్రిటన్ జోక్యం..
ఈ సమయంలో లీగ్ ఆఫ్ నేషన్ అనే పేరుతో బ్రిటన్ 1920 నుంచి 1948 వరకు పాలస్తీనాను పాలించింది. సీన్ కట్ చేస్తే రెండవ ప్రపంచ యుద్దంలో ఐరోపా దేశాలైన జర్మనీతో పాటూ ఇతర దేశాలపై తరచూ దాడులు జరుగుతూ ఉండేవి. దీంతో ఆప్రాంతాల్లోని యూదులు పాలస్తీనాలోకి వలస వచ్చి స్థిరపడ్డారు. దీంతో ఒక్కసారిగా యూదులు సంఖ్యతో పాటూ తమకు పాలస్తీనాను ఇచ్చేయాలనే డిమాండ్ కూడా పెరిగింది. ఇక్కడి నుంచి యుద్దం మరింత అగ్గిరాజుకుంది. ఈ గొడవలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని జెరుసెలేం ను స్థిరంగా ఉంచి పాలస్తీనాను యూదు, అరబ్ దేశంగా విభజించాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పాలస్తీన్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని ఎవరూ పరిష్కరించలేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రదాన సమస్యలు ఇవే..
రెండు దశాబ్ధాలుగా కొనసాగిన సంఘర్షణల్లో ముఖ్య ఘట్టాలు..
పాలస్తీన్లు తమ రాజ్యాధికారంతో పాటూ ప్రాత్యేక గుర్తింపు కోసం గడిచిన రెండున్నర, మూడు దశాబ్ధాలుగా అలుపెరుగని పోరాటాన్ని చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మరింత తీవ్ర తరం చేశారని చెప్పేందుకు నిదర్శనమే హమాస్ వద్ద ఉన్న యుద్ద ఆయుధాలు ఒక కారణం.
T.V.SRIKAR