తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో తప్పిన పెను ప్రమాదం. సుమారు వందేళ్లనాటి రావిచెట్టు కుప్పకూలింది. దీంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు టీటీడీ అధికారులు, స్థానిక పోలీసులు.

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద తప్పిన పెను ప్రమాదం
ఆలయ ధ్వజస్థంబం వద్ద ఉన్న చెట్టు నేలకొరిగింది
వందేళ్ల నాటి రావి చెట్టుగా చెబుతున్నారు స్థానికులు
మహావృక్షం కావడంతో చుట్టుపక్కన ఉన్న షాపులపైకి ఒరిగింది
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు
మృతుడు కడప కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు
యుద్దప్రాతి పదికన సహాయ చర్యలు చేపట్టారు పోలీసులు, ఆలయ సిబ్బంది
ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి
ప్రస్తుతం గోవిందరాజస్వామి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి
రేకుల షెడ్లు, పందిళ్లు కిందకు వాలిపోయాయి