బ్రేకింగ్‌: ఆత్మహ*త్య చేసుకుంటా నార్సింగి పీఎస్‌ ముందు లావణ్య రచ్చ

లావణ్య, రాజ్‌ తరున్‌ కేసులో హైడ్రామా కంటిన్యూ అవుతోంది. తనకు పోలీసులు న్యాయం చేయకపోతే నార్సింగి పీఎస్‌ ముందు తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ లావణ్య నార్సింగి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది.

Post Published By: Vencateshg
Updated : 19 April 2025, 3:08 PM IST

లావణ్య, రాజ్‌ తరున్‌ కేసులో హైడ్రామా కంటిన్యూ అవుతోంది. తనకు పోలీసులు న్యాయం చేయకపోతే నార్సింగి పీఎస్‌ ముందు తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ లావణ్య నార్సింగి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది. నిన్న రాత్రి మరికొందరు వ్యక్తులు తాను ఉంటున్న ప్రాంతానికి వచ్చి తనపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది.

మొన్న రాజ్‌ తరుణ్‌, అతని తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడంలేదంటూ లావణ్య ఆరోపించింది. తనకు ప్రాణ హాణి ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోవడంలేదని.. తనకు న్యాయం చేయకపోతే పోలీస్‌ స్టేషన్‌ ముందే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది లావణ్య.

Published : 
  • 19 April 2025, 3:08 PM IST