టీమిండియా దిగ్గజ ఓపెనర్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ తన వన్డే అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలకడానికి సిద్ధమయ్యాడు. జులై 19న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగబోయే ఆఖరి వన్డే మ్యాచ్లో రోహిత్ తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలకనున్న తరుణంలో, ఈ అద్భుతమైన ఘట్టాన్ని కళ్లారా వీక్షించడానికి అతని తల్లిదండ్రులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు.సెలెక్టర్లు 2027 వన్డే ప్రపంచకప్ కోసం భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేస్తూ, రోహిత్ను పక్కన పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్తో జరిగే ఈ వన్డే సిరీస్ తన కెరీర్లో ఆఖరిది కానుందని సెలెక్టర్లు స్పష్టం చేయడంతో, రోహిత్ శర్మ సైతం సగర్వంగా తప్పుకోవాలని భావిస్తున్నాడు. ముంబై వర్గాల నుంచి అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం, ఆదివారం జరిగే తన వీడ్కోలు మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రోహిత్ శర్మ తన తల్లిదండ్రులైన గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మలను లండన్ రప్పించాడు. భారత నీలి రంగు జెర్సీలో తమ కుమారుడిని ఆఖరిసారిగా చూసేందుకు ఆ తల్లిదండ్రులు లార్డ్స్ మైదానంలో హాజరు కానుండటం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఎంపిక కమిటీ భవిష్యత్తు వైపే అడుగులు వేస్తోంది.
2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని యశస్వి జైస్వాల్ లాంటి అద్భుతమైన ఫామ్లో ఉన్న యువ ఆటగాళ్లకు ఓపెనర్లుగా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. నిజానికి గత ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తోనే రోహిత్ కెరీర్ ముగుస్తుందని భావించినా, ఆ సిరీస్లో సాధించిన హాఫ్ సెంచరీ కారణంగా సెలెక్టర్లు ఈ నిర్ణయాన్ని మరికొంత కాలం వాయిదా వేశారు. అయితే ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. మొదటి వన్డేలో 11 పరుగులు, రెండో మ్యాచ్లో 26 పరుగులు మాత్రమే చేసి, ఇంగ్లాండ్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో సెలెక్టర్లు తమ నిర్ణయాన్ని రోహిత్కు స్పష్టం చేశారు.రోహిత్ శర్మ ఇప్పటికే మిగిలిన రెండు ఫార్మాట్లకు గుడ్బై చెప్పేసాడు.ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరగబోయే మ్యాచ్తో వన్డే క్రికెట్కు కూడా తెరపడనుంది.