Hyderabad Murders : ఈ రాష్ట్రానికి ఏం అయింది.. ఈ నగరంలో ఏం జరుగుతుంది.. రెండు రోజుల్లో 7 హత్యాలా..? కాంగ్రెస్ పాలనలో క్షిణించిన శాంతి భద్రతలు.. ఇన్ని హత్యలు జరుగుతున్న నోరు మెదపని సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఎన్నికల ముందు మాజీ సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నగరంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి. నగరంలో భయం భయంతో ప్రజలు బతకాల్సి వస్తుంది. నగరంలో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితులు వస్తాయి. అన్నట్లుగా తెలంగానలో అదే జరుగుతుంది. ఇక్కడ నగరంలో కర్ఫ్యూ విధించలేదు కానీ.. శాంతి భద్రతలు మాత్రం అదుపుతప్పినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.