దంచికొట్టిన జైస్వాల్, వైభవ్ రాజస్థాన్ చేతిలో ముంబై ఓటమి…!
రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. టాస్ పడడానికి గంట ముందు నుంచే గువాహటిలో భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ఆలస్యమవుతూ వచ్చింది. వర్షం తగ్గిన తర్వాత 11 ఓవర్లకు మ్యాచ్ కుదించారు. ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ఉంచడమే లక్ష్యంగా ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేశారు. తొలి బంతులనే ఇద్దరూ సిక్సర్లు బాదేశారు.