Good news for Tirumala devotees..Shrivari darshan tickets schedule release from today..
తిరుపతి: తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది క్యూకాంప్లెక్స్లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న సోమవారం 67,569 మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.58 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక స్వామివారికి 22,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 4గంటల్లో దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్..
ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.