Governor Abdul Nazir unfurled the flag at Indira Gandhi Stadium, Vijayawada.
దేశ వ్యాప్తంతగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎగరవేశారు. ఈ గణతంత్ర వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి (CM Jaganmohan Reddy), సీఎం సతీమణి భారతి, మంత్రులు, ఉన్నత అధికారులు హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ తర్వాత గవర్నర్ ఓపెన్ టాప్ జీపులో ఇండియన్ ఆర్మీ కంటింజెంట్, సీఆర్పీఎఫ్ కంటింజెంట్, తమిళనాడు స్టేట్ పోలీస్ స్పెషల్ కంటింజెంట్ సహా కొన్ని కంటింజెంట్లను గవర్నర్ పరేడ్ రివ్యూ చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ నజీర్ స్వీకరించారు.
ఇక రాష్ట్ర ప్రగతిని.. ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ కు అధికారులు వివరించారు. ఆపై పరేడ్లో వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్శనలో ఎన్నికల సంఘం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు ఆవశ్యకతను తెలియజేసేలా శకటాన్ని రూపొందించారు. గవర్నర్, జగన్ సహా పలువురు శకటాల ప్రదర్శనను తిలకించారు.
ఏపీ గవర్నర్ ప్రసంగం..
ఇవాళ్ల సాయంత్రం 4.15 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఆథిద్యం ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఏపీ సీఎంతో పాటు రాజకీయా పార్టీ ప్రధాన నాయకులు హాజరుకానున్నారు.