KTR is ashamed to hear the Governor's speech.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొదలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనంతరం మొట్ట మొదటి సారి ప్రతిపక్ష్యం లోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ.
నిన్న గవర్నర్ ప్రసంగం విని సిగ్గు పడుతున్నాం అని అన్నారు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్. గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలు, తప్పులే అని BRS ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో విమర్శించారు. 'గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గు పడుతున్నా. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు, తాగు నీటికి దిక్కులేదు. విద్యుత్ లేక పంటలు ఎండిపోయాయి. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు.. ఆకలి కేకలు ఉండేవి' అని మండిపడ్డారు.
కేటీఆర్ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పు పట్టారు. పదేళ్ల పాలన పై కాంగ్రెస్ చర్చ జరగాలి అంటే.. 50 ఏళ్ల పాలనపై చర్చ జరగాలని బీఆర్ఎస్ పట్టుపట్టింది.