These are the promises that KCR will announce in the BRS party's election manifesto today
తెలంగాణలో ఎన్నికల వేడి మరింత పుంజుకోనుంది. నేడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన ఎన్నికల మ్యానిఫెస్టోని ప్రకటిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా గతంలో ప్రకటించిన 115 మందితో పాటూ మరో నలుగురు అభ్యర్థులను ఖరారు చేసి బీ ఫాం అందించనున్నారు. అదే క్రమంలో తమ మ్యానిఫెస్టోని కూడా విడుదల చేసి సాయంత్రం హుస్నాబాద్ భారీ బహిరంగ సభతో కేసీఆర్ తన ఎన్నికల ప్రచారానికి శంఖారావంను పూరించనున్నారు.
మ్యానిఫెస్టోను ఎలా రూపొందించారు..
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. బడుగు బలహీన వర్గాలను కలుపుకుంటూ అందరికీ సంక్షేమం అందించే విధంగా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. 2014లో తెలంగాణ ఉద్యమంలో చెప్పిన కొన్ని హామీలతో తన మ్యానిఫెస్టోని ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ప్రకటించారు. ఆతరువాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో పోలింగ్ కి కేవలం మూడు రోజుల ముందు మ్యానిఫెస్టోను ప్రకటించి ఘనవిజయం సాధించింది. అయితే 2023లో మాత్రం ఎన్నికలకు దాదాపు 45 రోజుల ముందుగా మ్యానిఫెస్టో ప్రకటించి రికార్డ్ సృష్టించబోతోంది. దాదాపు నెల రోజుల పాటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నాయకులు, ఆర్థిక, సామాజిక నిపుణులతో పాటూ కొన్ని సామాజిక వర్గాల పెద్దల అభిప్రాయాలను సేకరించి దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో పాటూ ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న హామీల గురించి కూడా విస్తృతంగా పరిశీలించి ఈ మ్యానిఫెస్టోని రూపొందించినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఏఏ అంశాలు ఉండనున్నాయి..
వీటన్నింటితో పాటూ మరో 30కి పైగా సరికొత్త పథకాలను ప్రకటించి, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, నైపుణ్య శిక్షణా తరగతులు నిర్వహించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందించేలా సరికొత్త మ్యానిఫెస్టోని ప్రకటించనున్నారు. మహిళలు, రైతులు, యువత, పేదలతో పాటూ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని దీనిని తయారు చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని హామీలు తెలియాలంటే మ్యానిఫెస్టో ప్రకటించే వరకూ వేచి చూడాలి.
T.V.SRIKAR