Tirumala: తిరుమల ఆలయాన్ని ఫోటో తీసిన వ్యక్తి అరెస్ట్

తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి గోపురాన్ని వీడియో తీసిన వ్యక్తిని పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఈ వీడియో తీసింది కరీంనగర్ జిల్లాకు చెందిన రాహుల్ రెడ్డిగా గుర్తించారు. శేషపట్నంలో ఉండే రాహుల్ రెడ్డి.. చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. నిందితుడు వీడియో తీస్తున్న దృశ్యాలని సీసీ కెమెరాలో గుర్తించారు అధికారులు. అతని దర్శనం టికెట్, ఆధార్ కార్డు ద్వారా అడ్రెస్స్ కనుక్కున్నారు. రాహుల్ ట్రేస్ అవ్వడంతో వెంటనే అరెస్ట్ చేశారు. అసలు వీడియో తీయడానికి కారణం ఏంటి, సోషల్ మీడియాలో వీడియో పెట్టడానికి కారణం ఏంటి అనే అంశాలపై విచారణ చేపడుతున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 12 May 2023, 12:29 PM IST

Published : 
  • 12 May 2023, 12:29 PM IST

Exit mobile version