తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తరువాత… బీఆర్ఎస్ ఒంటరి అయింది. పదేళ్ళుగా తిరుగులేకుండా పాలించిన ఆ పార్టీ… మరో పదేళ్ళూ మేమే అని బీరాలు పోయింది. బీజేపీని, కాంగ్రెస్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టిపోశారు బీఆర్ఎస్ లోని ఆ నలుగురు పెద్దలు. కానీ ఓటమి తర్వాత కారు పార్టీ ఇప్పుడు కమలం వైపు చూస్తోందని అర్థమవుతోంది.
